తెలంగాణ
వైద్యురాలి హత్యకేసు దర్యాప్తునకు 10 బృందాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 November 2019
హైదరాబాద్: అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ ప్రియాంక రెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం పది బృందాలను ఏర్పాటుచేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్లో నివాసం ఉండే ప్రియాంకరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్గా పనిచేస్తున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గచ్చిబౌలి వద్ద ఆమె నడుపుతున్న స్కూటీకి పంక్చర్ అయింది. స్కూటీని బాగుచేయిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తీసుకువెళ్లారని, వారే ఆమెను చంపివుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, తెల్లవారుజామున ప్రియాంక సోదరి తమకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు.