బిజినెస్

అంచనా ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న వివిధ భారీ కంపెనీలకు సంబంధించిన మూడో త్రైమాసిక ఫలితాల అంచనాలే ఈవారం స్టాక్ మార్కెట్‌కు దిక్సూచి కానున్నాయి. ఈనెల 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగుస్తుంది. ఆతర్వాతే వివిధ కంపెనీలు ఈ మూడు నెలల ఫలితాలను వెల్లడిస్తాయి. అయితే, ఈలోపే మార్కెట్‌లో ఆయా కంపెనీల ఫలితాలపై అంచనాలు, విశే్లషణలు జోరందుకుంటాయి. దీనికితోడు ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో, అనేకానేక రంగాలతోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన గణాంకాలు కూడా వెలువడతాయి. సహజంగానే ఇలాంటి విశే్లషణలు, గణాంకాలు, అంచనాలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈవారం అలాంటి పరిస్థితే నెలకొనే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ, సంవత్సరం మొత్తంలో ఆయా కంపెనీల తీరుతెన్నులు, లాభనష్టాల వివరాలు కూడా అందుతాయి.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారం స్టాక్ మార్కెట్ మార్కెట్లలో పెద్దపెద్ద కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాల పాత్ర కీలకమన్నది వాస్తవం. దీనితోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువ, పెట్టుబడులు, సెంటిమెంట్ పొకడలు వంటి ఇతర అంశాలు కూడా వచ్చేవారం భావం చూపనున్నాయి. స్వల్పకాల మదుపరులంతా ఎక్కువగా స్థూలంగా ఈ ఏడాది, నికరంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలనే ప్రమాణికంగా తీసుకొని, తగిన నిర్ణయాలు తీసుకుంటారనేది వాస్తవం. కార్పొరేట్ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రాధాన్యతా రంగాల్లో ఫలితాలే పెట్టుబడిదారులు తీసుకోబోయే నిర్ణయాలకు పునాదులవుతాయి. కార్పొరేట్ రంగానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే, భారీ కంపెనీల లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత, విదేశీ పెట్టుబడుల పరిణామం స్పష్టమవుతుంది. ఏ స్థాయిలో ఎఫ్‌ఐఐ తరలి వస్తాయి? ఎంత మొత్తంలో స్టాక్ మార్కెట్లు లాభపడుతాయి? అనే ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం రావడం లేదు. అయితే, వీటి ప్రభావం తీవ్రంగానే ఉంటుందని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలావుంటే, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రగడ, జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సీ)పై ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నందున, మార్కెట్‌లో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఆర్థిక సేవల పరిశ్రమ ఉత్తమ ఫలితాలను రాబడుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్ల గమనం కూడా భారత మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోనూ మాంద్య పరిస్థితులు, అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, స్టాక్ మార్కెట్‌లో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, కాబట్టి, అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండవని అనుకోవడానికి వీల్లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో, రాబోయే కాలానికి ఇప్పుడే పునాదలు పడతాయన్నది మాత్రం నిజం.