రాష్ట్రీయం
నేటి నుంచి శ్రీవారి సుప్రభాతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 January 2020
తిరుపతి, జనవరి 14: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి సుప్రభాత సేవ మళ్లీ మొదలు కానుందని టీటీడీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం సందర్భంగా వేకువజామునే సుప్రభాసం పఠించే సమయంలో తిరుప్పావై పాశురాలను సేవాకాలం పేరిట పఠిస్తారు. ఆ సందర్భంగా సుప్రభాత సేవను నెలరోజులపాటు ఆలయంలో నిలిపివేస్తారు.
ధనుర్మాసం పూర్తికాగానే సంక్రాంతి నుంచి యధావిధిగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునరుద్ధరిస్తున్నామని అధికారులు తెలిపారు. ధనుర్మాసం ముగిసిన సందర్భంగా ఈనెల 15నుంచి వేకువజామున శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ మళ్లీ మొదలవుతుంది. ధనుర్మాసం సందర్భంగా సుప్రభాత సమయంలో తిరుప్పావై పాశురాలను గానం చేశారు.