రాష్ట్రీయం
ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 March 2020
తిరుపతి: తిరుమలలో శ్రీవారికి గత ఐదు రోజులుగా జరుగుతున్న తెప్పోత్సవాలు సోమవారంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు సర్వాలంకార భూషితుడై తెప్పపై అధిరోహించి శ్రీవారి పుష్కరిణిలో ఏడుచుట్లు వేసి విహరించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో చేసిన గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ్యర్, చిన్నజీయ్యర్ స్వాములు, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
*చిత్రం... సోమవారం మలయప్పస్వామికి తెప్పోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం