ఆంధ్రప్రదేశ్‌

వివాహితపై యాసిడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మే 16 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మపై శిరివెళ్లకు చెందిన రాజు సోమవారం యాసిడ్‌తో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ సంఘటనకు సంబంధించి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. కోటకందుకూరుకు చెందిన సుబ్బలక్ష్మమ్మను శిరివెళ్లకు చెందిన నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగ సంతానం. అయితే గత కొన్ని నెలలుగా రాజు సుబ్బలక్ష్మమ్మ వెంట పడుతూ వేధించేవాడు. ఇది భరించలేక ఆమె మూడు నెలల క్రితం తన పుట్టినిళ్లయిన కోటకందుకూరుకు చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం రాజు కోటకందుకూరుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా వున్న సుబ్బలక్ష్మమ్మ వద్దకు వెళ్లి తనతో రావాలని ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా అంది. దీంతో ఆవేశానికి గురైన రాజు వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో దాడి చేయగా ఆమె ఆర్తనాదాలు పెట్టింది. బంధువులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని అపస్మారకస్థితిలో పడి వున్న సుబ్బలక్ష్మమ్మను ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. రాజును పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు.

చిత్రం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మమ్మను పరామర్శిస్తున్న జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ