ప్రకాశం

మహిళను రివాల్వర్‌తో బెదిరించి బంగారం, నగదు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిగిరి రూరల్, మే 26: మహిళను రివాల్వర్‌తో బెదిరించి బంగారం, నగదును చోరీ చేసిన సంఘటన పట్టణంలో గురువారం సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంతాల్లో విశ్రాంత ఎస్‌ఐ పి నారాయణ నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో నారాయణ ఇంట్లో లేని సమయంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి ‘సార్ ఉన్నారా’ అని నారాయణ సతీమణిని నాగమణిని అడిగారు. అనంతరం ఇంట్లోకి చొరబడి నాగమణిపై రివాల్వర్ గురిపెట్టి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకురావాలని బెదిరించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన నాగమణి ఇంట్లో ఉన్న బీరువా తాళాలను వారికి ఇవ్వడంతో వారు బీరువాను తెరిచి 60 సవర్ల బంగారం, నగదు 16,300 రూపాయలతో పాటు రెండు ఏటిఎం కార్డులను కూడా దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగి నారాయణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎస్పీ ప్రకాష్‌రావు నేతృత్వంలో సిఐ సుధాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు చోరీ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.