కృష్ణ

ఆంజనేయస్వామికి లక్ష మల్లెల అర్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 2: స్థానిక ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మందిరంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి లక్ష మల్లెలార్చన నిర్వహించారు. అర్చకులు చల్లపల్లి నాగ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన సభలో సరస్వతి కళాసమితి అధ్యక్షులు సి శేషాచార్యులు (అప్పాజి), ప్రముఖ సంగీత విద్వాంసులు చిట్టా గోపాలకృష్ణమూర్తి మందిర చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు భక్తి గీతాలు, హనుమాన్ ఛాలీసా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.