ఆంధ్రప్రదేశ్‌

బస్సు బోల్తా: 14 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 2: విశాఖ జిల్లా పాడేరు మండలం మినుములూరు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో పద్నాలుగు మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న పాడేరు డిపోకు చెందిన బస్సు మినుములూరు గ్రామం వద్ద మలుపులో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. మలుపు వద్ద డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన అక్కమ్మకు, పాడేరు మండలం లగిశపల్లి గ్రామానికి చెందిన దేముళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.