శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భార్యను కడతేర్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, జూన్ 7: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను భర్త అతి కిరాతకంగా కడతేర్చిన సంఘటన రాపూరు మండలం పుమాయి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన మునెమ్మకు పుమాయి గ్రామానికి చెందిన పులగల సుధాకర్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతవరకు అన్యోన్యంగా జరిగిన జీవితానికి నిదర్శంగా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇటీవల వీరి కాపురంలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. సుమారు మూడు నెలల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక మునెమ్మ పుట్టింటికి వెళ్లింది. మునెమ్మకు పుట్టింట్లో బంధువులు, స్థానికులు నచ్చచెప్పి భర్తతోనే సర్దుకుపోవాలని చెప్పడంతో ఆమె ఇటీవల పుమాయి గ్రామానికి వచ్చింది. ఏమైందో ఏమోగాని మంగళవారం ఉందయం మునెమ్మపై భర్త ప్రభాకర్ రోకలిబండతో విచక్షణారహితంగా తలపై కొట్టడడంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న గూడూరు డిఎస్పీ డి శ్రీనివాసరావు, వెంకటగిరి సిఐ శ్రీనివాస్, రాపూరు ఎస్సై షేక్ కరీముల్లా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య జరిగిన తీరును పరిశీలించి ఇరుగు పొరుగు వారిని ఈ ఘటనపై విచారించి వివరాలు తెలుసుకున్నారు. కాగా హత్యచేసిన ప్రభాకర్ పరారయ్యాడు. హత్యా స్థలాన్ని డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, రెండు రోజుల్లో పట్టుకుంటామని గూడూరు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హత్యానంతరం అనాథలైన చిన్నారులు తరుణ్, శశాంక్‌లు తల్లి మృతదేహం వద్ద రోధిస్తున్న వారిని చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టారు.