మహబూబ్‌నగర్

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, జూన్ 23: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, కాంగ్రెస్‌లో యువత ఎక్కువగా ఉందని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హర్షద్ అన్నారు. గురువారం బాలానగర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాలలో అభివృద్ది చెందాలంటే యువత ముందుండాలని, యూత్ కాంగ్రెస్‌లో ఎంతో మంది యువత ఉందని, 2019వ సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందు కెసిఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి యువతను ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చిన తరువాత యువతను పట్టించుకోవడమే మరిచిపోయారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పరాభావం తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపి, ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిఆర్‌ఎస్ పార్టీలో చేరినంతా మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమి లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ఎక్కువగా బరిలో ఉంటారని తెలిపారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు యువజన నాయకులు కృషిచేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరిస్తూ, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నందీశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, నాయకులు బిచ్యునాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలునాయక్, యాదగిరిరెడ్డి, యాదగిరి, నర్సింలు పాల్గొన్నారు.