కృష్ణ

ట్రాక్టర్ ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూలై 22: స్థానిక ప్రధాన రహదారిలో శుక్రవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో టివిఎస్ మోపెడ్‌పై వెళుతున్న దంపతులను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనటంతో భర్త మృతి చెందాడు. స్థానిక మండలిపురం నుండి హోటల్ వ్యాపారి బండే నాంచారయ్య(70), ఈశ్వరమ్మ దంపతులు విద్యుత్ రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న హోటల్‌కు బయలుదేరారు. వెంకటేశ్వర టాకీసు సెంటరుకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న వేకనూరుకు చెందిన ట్రాక్టర్ ఢీకొనటంతో తీవ్ర గాయాలకు గురయ్యారు. ట్రాక్టర్ వద్దకు టివిఎస్ దూసుకుపోవటంతో దాదాపు నాలుగు మీటర్ల దూరం బండిని, దంపతులను ట్రాక్టర్ ఈడ్చుకువెళ్ళింది. తీవ్ర గాయాలపాలైన దంపతులను 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ భర్త నాంచారయ్య మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మకు నడుంపై తీవ్ర గాయం కావటంతో డా. ప్రమీల ఉన్నత చికిత్సకై మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నాంచారయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు.