ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: పార్టీ శ్రేణులకు సిఎం చంద్రబాబు కొత్త అసైన్‌మెంట్ ఇచ్చారు. పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల గురించి పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నాయని చంద్రబాబు చాలా కాలంగా ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు రేటింగ్ ఇచ్చి, అట్టడుగు రేటింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సహా 400 మంది పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం కృష్ణా డెల్టా ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు సుమారు 3000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు కావల్సినవన్నీ ప్రభుత్వమే చేస్తోందని, మరో పార్టీతో అవసరం లేదన్న భావన ప్రజల్లో తీసుకురావాలని చంద్రబాబు శ్రేణులకు మార్గ నిర్దేకం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వలన చేకూరిన లాభం గురించి, ఎప్పుడూ ప్రజల్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.
పట్టిసీమపై తీర్మానించాలి
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి వెళ్లండి.. గతంలో సాగు నీటి ఎద్దడి గురించి ప్రజలకు, రైతులకు గుర్తు చేయండి. పట్టిసీమ రావడం వలన వచ్చిన లాభాలను ప్రజలకు తెలియచేయండి. అలాగే పట్టిసీమపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా వివరించండి అంటూ చంద్రబాబు కృష్ణా డెల్టాలోని ముఖ్య నాయకులకు, రైతు సంఘాల నాయకులకు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ధన్యవాదాలు తెలియచేస్తూ గ్రామ సభల్లో తీర్మానాలు చేయించాలని సూచించారు.