కరీంనగర్
నేటి నుంచి డిగ్రీ మూడోదశ ప్రవేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కరీంనగర్ టౌన్, జూలై 25: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీలో మూడో దశ ప్రవేశాలు నేటి నుంచి మొదలవుతాయని శాతవాహన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఎం. కోమల్రెడ్డి తెలిపారు. వర్సిటీ పరిధిలోని 125 డిగ్రీ కళాశాలల్లో 53,880 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 22,038 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు వెల్లడించారు. గత ఏడాది 23,579 సీట్లు భర్తీకాగా, చివరి దశ సీట్ల కేటాయింపుకు ముందే ఈసారి 41 శాతం సీట్లు నిండినట్లు పేర్కొన్నారు. ఒకటి, రెండు దశల్లో ప్రవేశాల కోసం నమోదు చేసుకోని వారితో పాటు ప్రస్తుతం సీట్లు పొందినవారు కూడా ఆసక్తి గల కళాశాలలకు వెళ్ళేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు నమోదుచేసుకున్నా ఆప్షన్లు ఇవ్వనివారందరికీ సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చని, ఆగస్టు 2 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుందని, 4 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ప్రవేశాల విషయంలోప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.