గుంటూరు

స్వచ్ఛతకు ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 17: మహాత్ముడు కన్న కలలు నిజం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా శనివారం స్థానిక గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో గుంటూరు జిల్లా నీరు, పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యాన నూటికి నూరుశాతం బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా గుర్తించే ప్రక్రియపై ఏర్పాటుచేసిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే అక్షరాస్యత, పారిశుద్ధ్యం, ఆర్థికాభివృద్ధి మూడు ప్రధాన అంశాలని పేర్కొన్నారు. గాంధీజీ అహింసామార్గంలో పయనిస్తూ స్వేచ్చా భారత్‌ను సాధించారని, అనంతరం స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మహాత్ముని పిలుపునందుకున్న ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ్భారత్‌ను పిలుపునిస్తే, ఈ స్ఫూర్తితో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రపంచంలో బంగ్లాదేశ్‌లో 99 శాతం, శ్రీలంకలో 95 శాతం పారిశుద్ధ్యం అమలవుతుండగా మన దేశంలో 59 శాతంగా ఉందన్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబంలో మరుగుదొడ్డి లేకపోతే సంవత్సరానికి ఒక మనిషి 2,500 రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రతి కుటుంబానికి 15 వేలతో మరుగుదొడ్డిని నిర్మించి ఇస్తోందన్నారు. గ్రామాల్లో అపరిశుభత్రపై చర్చ జరగాలని, పారిశుద్ధ్యం, ఆరోగ్యం పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన రావాలని కోడెల సూచించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలను కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ ఏడాది ఆఖరికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ఇతర జిల్లాలకు ఆదర్శం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలోని 1,011 గ్రామాలకు గాను ప్రాథమిక దశలో 462 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా వచ్చే నెల 2వ తేదీ నాటికి ప్రకటించనున్నామన్నారు. స్వచ్ఛ్భారత్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది అక్బోర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ప్రతిజ్ఞ చేసిన అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లను బహిరంగ మల విసర్జన లేని మునిసిపాలిటీలుగా ప్రకటించేందుకు సిద్ధ పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 88 శాతం పూరె్తైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, కొమ్మాలపాటి శ్రీ్ధర్, నక్కా ఆనంద్‌బాబు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ భానుప్రసాద్, ఇన్‌ఛార్జి జెసి ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కొసనా నాగబాబు, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు అనూరాధ, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ కృష్ణకపర్థి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపిపిలు పాల్గొన్నారు.

లాకౌట్ ఎత్తివేయకుంటే ఆమరణ దీక్ష
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 17: భజరంగ్ జూట్‌మిల్లుపై లాకౌట్‌ను ఎత్తివేసి కార్మికులకు పని కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మిక నేతలు అల్టిమేటం జారీచేశారు. శనివారం జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో స్ఫూర్తి కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో జూట్‌మిల్లు యాజమాన్య వాదనలను కార్మిక నాయకులు తీవ్రంగా ఖండించారు. జూట్‌మిల్లు తెరవడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అంగీకరించేది లేదని అప్పిరెడ్డి స్పష్టంచేశారు. అక్టోబర్ 2 నాటికి సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జూట్‌మిల్లు యాజమాన్యం కార్మికుల కడుపుకొట్టే ప్రయత్నాలు చేస్తుందని, సిఎం చంద్రబాబునాయుడు స్వయాన వచ్చి హామీ ఇచ్చినా యాజమాన్యం మొండివైఖరి విడనాడటం లేదని ఆరోపించారు. న్యాయవాది వైకె మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, పరిరక్షణ సమితి సభ్యులు పాండురంగ తదితరులు పాల్గొన్నారు.

రాజా వేంకటాద్రి నాయుడుకు ఘన నివాళి
అమరావతి, సెప్టెంబర్ 17: అమరావతి జమిందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ద్విశతాబ్ది వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, తదితరులు అమరేశ్వర స్వామి దేవస్థానం వద్ద గల రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పల్నాడు అభివృద్ధికి చేయూతనివ్వండి
* హెచ్‌పిసిఎల్ ప్రతినిధులతో రాయపాటి
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 17: వెనుకబడిన పల్నాడు ప్రాంతాభివృద్ధికి చేయూతనందించి సహకరించాలని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులను నరసరావుపేట ఎంపి రాయపాటి విజ్ఞప్తిచేశారు. సంస్థ చైర్మన్ ముఖేష్ కుమార్ సురానా ఆదేశాల మేరకు దక్షిణభారత జోనల్ మేనేజర్ ఇఎస్‌వి ప్రసాద్, సిఎస్‌ఆర్ చీఫ్ మేనేజర్ జెడ్‌హెచ్ మొల్లా శనివారం గుంటూరులోని రాయపాటి నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో హెచ్‌పిసిఎల్ చైర్మన్‌ను రాయపాటి కలిసి సిఎస్‌ఆర్ నిధుల ద్వారా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పల్నాడు ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్పందించిన ఛైర్మన్ అభివృద్ధి కార్యక్రమాలపై రాయపాటితో చర్చించాల్సిందిగా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రధానంగా మంచినీరు, ఫ్లోరైడ్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాయపాటి వివరించారు.డ్రెయినేజీ, వాటర్‌ప్లాంట్‌ల నిర్మాణం, వౌళిక వసతుల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకరించాలని కోరారు. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి తమకు అందిస్తే ఛైర్మన్, ఉన్నతాధికారులతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు.

షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలం వాయదా
మంగళగిరి, సెప్టెంబర్ 17: స్థానిక మండల పరిషత్ పరిధిలోని వైఎస్ రాజశేఖరరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్, పాతూరి నాగభూషణం షాపింగ్ కాంప్లెక్స్ గదుల్లో గత కొనే్నళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించి తిరిగి గదులకు వేలంపాటలు నిర్వహించే అశంపై శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి పచ్చల రత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఎంపిటిసి సభ్యుల సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా షాపింగ్ కాంప్లెక్స్ గదుల్లో వ్యాపారాలు సాగిస్తూ జీవనోపాధి పొందుతున్న వారికి అన్యాయం జరుగకుండా చూడాలని అన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య మాట్లాడుతూ ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ గదుల్లో ఉన్న వారినే కొనసాగించి నిబంధనల ప్రకారం అద్దె పెంచాలని కోరారు. వైసీపీకి చెందిన పలువురు ఎంపిటిసి సభ్యులు మాట్లాడుతూ కోర్టునుంచి వచ్చిన ఉత్తర్వులుపై చర్చించేందుకు కొంత సమయం కావాలని, మరోసారి సమావేశమై గదుల గురించి తుది నిర్ణయం తీసుకుందామని కోరారు. ప్రతిపక్ష టిడిపి సభ్యులు ప్రస్తుతం ఉన్న వారిని ఖాళీ చేయించి బహిరంగ వేలంపాటలు జరపాలని కోరారు. ఈ నెలాఖరుకు జరపాలనుకున్న వేలంను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తెనాలి జిల్లా ఆసుపత్రిలో
మితిమీరిన రాజకీయాలు, గ్రూపులు
* త్వరలోనే అన్నింటినీ పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే ఆలపాటి
తెనాలి, సెప్టెంబర్ 17: గుంటూరు జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రులలో రెండవదైన తెనాలి జిల్లా ఆసుపత్రిలో రాజకీయాలు, గ్రూపులు ఎక్కువయ్యాయని, అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, త్వరలోనే అన్నింటినీ సమూలంగా పరిష్కరిస్తామని స్థానిక శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న బాలింతలకు ఇన్‌ఫెక్షన్‌సోకిన కారణంగా మరోమారు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు చెబుతున్నారని బాలింతల బంధువులు ఎమ్మార్పీఎస్ నాయకుల ముందు వాపోవటంతో వారు శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న తెనాలి శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ శనివారం ఉదయం 10.05 గంటలకు ఆసుపత్రికి చేరుకుని అకశ్మిక తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతల వార్డులను సందర్శించి వారితో సమస్యలపై విచారించారు. బిడ్డలను ప్రసవించిన బాలింతల తల్లులు తమ పిల్లలకు మరోమారు ఆపరేషన్ చేయాలంటున్నారని ఎమ్మెల్యే ముందు బోరున విలపించారు. స్పందించిన ఎమ్మెల్యే వైద్యులను అక్కడే పిలిపించి ఎందుకు ఇలాజరిగిందో, ఇన్‌ఫెక్షన్‌కు కారణం ఏమిటో, సంబంధిత వైద్యులు ఎవరో తనకు రాతపూర్వక సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కబ్బయ్యతో ఆసుపత్రిలో జరుగుతున్న వైద్యసేవలు, పరికరాలు, వైద్యుల విధి నిర్వహణ, నిర్లక్ష్యం వంటి అంశాలపై గంటపాటు చర్చించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ఆసుపత్రిలో రాజకీయాలు, గ్రూపులు పెరిగిపోతున్నాయని, రోగుల వెంట ఎక్కువ సంఖ్యలో వారికి సంబందించిన మనుష్యులు వస్తున్నారని, అటెండర్లు సక్రమంగా విధులు నిర్వహించటంలేదని అసహనం వ్యక్తం చేశారు. వైద్యశాలలో సీనియర్ వైద్యులు సెలవులపై వెళ్ళేందుకు ఇక్కడ నూతనంగా వచ్చిన అధికారి కారణమంటూ వార్తలు వినవస్తున్నాయన్న ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజలకు సేవ చేయాలనునేవారు విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. వైద్యశాలలో అధికారులు, వైద్యుల మధ్య కమ్యూనికేషన్ కొరవడిందని, ఈ కారణంగా పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటుచేసి బాలింతలకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కబ్బయ్య, సభ్యులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

బొజ్జా తారకం మృతి దళిత ఉద్యమాలకు తీరనిలోటు
అచ్చంపేట, సెప్టెంబర్ 17: దళిత ఉద్యమ నేత, న్యాయవాది, రచయిత బొజ్జా తారకం మృతి దళిత ఉద్యమాలకు తీరనిలోటని దళిత నాయకులు శనివారం నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలిపేందుకు ఏర్పాటుచేసిన సభలో పలువురు మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడుగా బొజ్జా తారకం పలు ఉద్యమాలకు ఊపిరి పోశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం అమలుకు ఏర్పాటుచేసిన కేంద్ర కమిటీలో తారకం కీలకంగా పనిచేశారన్నారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకా చంద్రయ్య, లీఫ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు ఎస్ నరసింహారావు, ఎస్‌కె రసూల్, చెన్నకేశవులు, అశోక్, చిన్న శ్రీను తదితరులున్నారు.

27వ సారీ చాంబర్ అధ్యక్షనిగా ఆతుకూరే..
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 17: ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఆతుకూరి ఆంజనేయులు 27వ సారి కూడా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. శనివారం చాంబర్ ఎన్నికల్లో భాగంగా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగగా, అధ్యక్ష పదవికి ఆంజనేయులు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం కానున్నారు. 6 ఉపాధ్యక్ష పదవులకు 12 నామినేషన్లు, 3 గౌరవ కార్యదర్శి పదవులకు 5, కార్యవర్గ సభ్యుల పదవులకు 37 నామినేషన్లు, 9 అనుబంధ సంస్థ కార్యవర్గ సభ్య పదవులకు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 27వ తేదీన భారత వాణిజ్య మండలి కార్యాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 76 సంవత్సరాలుగా సంస్థకు 3000 మంది సభ్యులు, 90 అనుబంధ సంస్ధలు ఉన్నాయి.

బుకింగ్ పాయింట్ల వద్ద ఆర్‌ఎం తనిఖీలు
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 17: ఎపిఎస్ ఆర్టీసీ గుంటూరు జిల్లా ప్రాంతీయ అధికారి జ్ఞానంగారి శ్రీహరి శనివారం విజయవాడ- గుం టూరు మార్గంలోని ఆర్టీసీ బుకింగ్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీచేశారు. విజయవాడ-గుంటూరు మార్గంలోని కనకదుర్గ వారధి వద్ద నాన్‌స్టాప్ బస్సులకు టిక్కెట్లు ఇచ్చే సిబ్బంది పనితీరుపై ప్రయాణికులను వాకబు చేశారు. అలాగే మార్గమధ్యలో ఏర్పా టు చేసిన బుకింగ్ కౌంటర్ల వద్ద నాన్‌స్టాప్ బస్సుల ప్రయాణికులకు టిక్కె ట్లు ఇచ్చే సందర్భంలో సమయం వృథా అవుతుందా, బస్సులు ఆపుతున్నారా, లేదా అనే విషయాలపై ఆరా తీ శారు. టిక్కెట్లు ఇచ్చే సమయంలో ప్రయాణికులతో స్నేహభావంతో మెలగాలని, చిల్లర పెండింగ్‌లో ఉంచరాదని, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.

వావిలాల ఆశయాలను ఆచరణలో పెడదాం
* జయంతి సభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు
సత్తెనపల్లి, సెప్టెంబర్ 17: సమాజంలో మహిళల అభివృద్ధే ధ్యేయంగా దివంగత వావిలాల గోపాలకృష్ణయ్య నియోజవర్గాన్ని పాలించారని, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అందరూ కలసి కృషి చేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వావిలాల 111వ జయంతి కార్యక్రమంలో కోడెల ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అక్టోబర్ 2 నాటికి నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లను పూర్తి చేసే లక్షంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో కేంద్ర బృందం సర్వేలో సత్తెనపల్లి నియోజకవర్గంలో 20 శాతం అంటురోగాలు తగ్గిపోయాయని తేలినట్లు వివరించారు. అచ్చంపేట రోడ్డులోని రైల్వే గేటువద్ద త్వరలోనే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని స్పీకర్ తెలిపారు.
పాత్రికేయులుకూడా సామాజిక చైతన్యంకోసం ప్రతి నెలలో ఒక రోజును కేటాయించాలని సూచించారు. ముందుగా స్పీకర్ జ్వోతి వెలిగించి వావిలాల చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, నరిశేటి గురవయ్య, పట్టణ అధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ, చౌటా శ్రీను, బచ్చు మనోహర్, దర్శి సురేష్, కోమటినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనధికార బ్యానర్లు తొలగించాలి
గుంటూరు (కార్పొరేషన్), సెప్టెంబర్ 17: నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన బ్యానర్లు, గోడపత్రికలను తొలగించాలని గుంటూరు నగరపాలక సంస్థ ఇన్‌చార్జికమిషనర్ కృష్ణకపర్థి పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేయు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరం పరిసర ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే నాజ్‌సెంటర్, ఉమెన్స్ కాలేజీ, అరండల్‌పేట, లక్ష్మీపురం, గుంటగ్రౌండ్, కొత్తపేట, ఓల్డ్‌క్లబ్‌రోడ్డు, మణిపురం బ్రిడ్జి,కాకానిరోడ్డు, స్టాల్ బాలికల స్కూలు తదితర ప్రాంతాల్లో డివైడర్ల వెంబడి ఉన్న ఇసుక, కొట్టివేసిన మొక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించాలని, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు దగ్గర ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే నగర సుందరీకరణకు అడ్డుగా ఉండే బ్యానర్లు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసి యేసుదాసు, ఎస్‌ఇ గోపాలకృష్ణారెడ్డి, ఇఇ రాంనాయక్, డిఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అవినీతికి తావులేకుండా పోరాటం
* వామపక్ష పోరాటాలకు సెక్యులర్‌లు సహకరించాలి: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 18: దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పారిశ్రామికవేత్తలకే లబ్ధిచేకూరుతుందని, అవినీతికి తావులేకుండా దేశవ్యాప్తంగా సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు ఎపి రాష్ట్ర సమితి పార్టీ హోల్‌టైమర్ల రాష్టస్థ్రాయి శిక్షణ తరగతులు నగరంపాలెంలోని కెకెఆర్ ఫంక్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ నిరంకుశ ధోరణితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, నాయకులకు ఆత్మగౌరవం ఉంటే పదవుల నుంచి తప్పుకుని హోదా కోసం పోరాటం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి హవా రోజురోజుకూ తగ్గుతూ వస్తుందన్నారు. ఢిల్లీ, బీహార్, అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. యుపి ఎన్నికల్లో గెలుపుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వారికి అనుకూలంగా ప్రజలు లేరన్నారు. వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలకు సెక్యులర్‌లు సహకరించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ ప్రజా సమస్యలతో పాటు సామాజిక అంశాలైన ప్రత్యేకమోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం తదితర అంశాలపై పోరాటం చేస్తూనే ఉందన్నారు. వెంకయ్య నాయుడు పదే పదే తప్పులు చేస్తున్నారని, గతంలో హోదా సాధించామని సన్మానం చేయించుకుని, ప్రస్తుతం ప్యాకేజీ సాధించామని మరో మారు సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఈ సన్మానాలకు చంద్రబాబు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ప్యాకేజీ వలన 2.25 లక్షల నిధులు వస్తాయని వెంకయ్య నాయుడు చెప్తుండగా 70 వేల ఓట్లు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారని, ఏది వాస్తవమో స్పష్టంచేయాలన్నారు. వీరందరినీ పెట్టి ఇద్దరు మోసగాళ్లు సినిమా తీస్తే బాగుంటుందని, నరేంద్రమోదీ ముందు మాట్లాడే దమ్ములేనివారు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దొంగ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జాతీయ కంట్రల్ కమిషన్ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందన్నారు. ప్రస్తుతం సమస్యలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విప్లవాన్ని సామాజిక, సాంస్కృతికంగా ఆయా రంగాల్లో చైతన్యం తీసుకురావడానికి పార్టీ కృషిచేయాలన్నారు. ప్రస్తుత శిక్షణా తరగతులు బలమైన పార్టీ ఏర్పాటుకు ఎంతో ఉపకరిస్తాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు హరనాథరెడ్డి, జె విల్సన్, ఓబులేసు, జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్, కోట మాల్యాద్రి, సమితి సభ్యులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, గని, పులి సాంబశివరావు, చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
* ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్
పెదకూరపాడు, సెప్టెంబర్ 18: మండలంలోని మారుమూల గ్రామా ల్లో సైతం పల్లెలు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెదకూరపాడు శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. మండలంలోని పెదకూరపాడు గ్రామంలో జీవో నెంబర్ 389 గ్రాంట్ ద్వారా కోటి 95 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో 10వ వార్డులో పాలకేంద్రం వద్ద ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్లకు ఎమ్మెల్యే శ్రీ్ధర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆనందపేటలోని ఎంపిపి స్కూలు వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు మండల టిడిపి ప్రముఖులతో కలిసి శంకుస్థాపన గావించారు. తొలుతగా పెదకూరపాడు పొలాల్లో ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్-2 ద్వారా లక్షా 18 వేల కిమ్మత్తుతో ఏర్పాటుచేసిన బోరుబావికి ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభోత్సవం చేశారు. ఎండిఒ కావూరి గీతారాణి ఆధ్వర్యంలో బోరుబావులు మండలంలో సుమారు 82 వరకు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామగోపాలరావు, గల్లా బాబురావు, యార్డు డైరెక్టర్ ఏటుకూరి బ్రహ్మయ్య, సొసైటీ డైరెక్టర్ భాష్యం ఆంజనేయులు, చెరుకూరి పుల్లయ్య, ఏటుకూరి వెంకటరత్నం, వడ్లమూడి అప్పారావు, పాటిబండ్ల మాబు, డీలర్ సయ్యద్ సుభాని, కాల్వ అప్పారావు, ఎంపిపి శివమ్మ, 75 తాళ్లూరు సాయి, ఆంజనేయరెడ్డి, వెంకటరెడ్డి, జెడ్పీటీసీ షరీఫ్, షేక్ లాలు, ఖలీల్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ముస్లిం మైనార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని షాదీఖానాలో ఏర్పాటుచేయగా ఎమ్మెల్యే శ్రీ్ధర్ పాల్గొని కార్యకర్తలతో ముచ్చటించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్త నందిగం రమేష్ మాతృమూర్తి చనిపోయినందున అతని గృహానికి వెళ్లి ఎమ్మెల్యే శ్రీ్ధర్ రమేష్‌ను పరామర్శించారు.

ప్రమాదకరంగా డ్రైనేజీలు
మంగళగిరి, సెప్టెంబర్ 18: పట్టణంలో ఎల్లవేళలా ట్రాఫిక్ రద్దీతో ఉండే గౌతమబుద్ధ రోడ్డుకు తూర్పువైపున గల డ్రైనేజీ పాలకుల నిర్లక్ష్యాన్ని చాటిచెప్తోంది, వ్యాపార సంస్థల ఎదుట 8 నుంచి 10 అడుగుల వెడల్పున ఉన్న డ్రైనేజీ ప్రమాదకరంగా దర్శన మిస్తుండటంతో పౌరులు , వ్యాపారస్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వ్యాపార సంస్థల ఎదుట నడకకోసం సొంతఖర్చులతో వెదురుకడ్డీలు, చెక్క, ఇనుప రేకులతో దారిని ఏర్పాటు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్‌నుంచి కిలోమీటరు పొడవునా డ్రైనేజీ మురుగుతో నిండి నీటిపారుదలలేక అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజ లు అల్లాడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 30 కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైనేజీలను నిర్మించారు. డ్రైనేజీల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నరేళ్ల కిందట టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మంగళగిరి అభివృద్ధికి కేటాయించిన నిధులు తక్కువేనని చెప్పవచ్చు. మున్సిపల్ పాలకవర్గం అధికార పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ నిధుల సాధనలో విఫల మయిందన్న విమర్శలు ఉన్నాయి. కొండ ప్రాంతంనుంచి వచ్చే మురుగునీరు, వర్షపునీరు ప్రవహించే ప్రధానమైన డ్రైనేజీ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించు కోవడంలేదని ప్రజానీకం వాపోతోంది. ఈ ప్రాంతం రాజధానిగా మారినప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గౌతమబుద్ధ రోడ్డులో నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. పక్కనే ఉన్న డ్రైనేజీ గురించి మాత్రం పట్టించుకున్నవారే లేరు. అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఆదాయంపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని వినవస్తోంది. ఒకప్పుడు సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులు సైతం ఏ కారణం చేతనో వెనుకడుగు వేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు గౌతమబుద్ధ రోడ్డులోని డ్రెయిన్ నిండుగా ఉద్ధృత ప్రవాహంతో ఉంటుంది. ఆ సమయంలో చిన్నపిల్లలు, ఏదైనా వస్తువులు ప్రమాద వశాత్తు డ్రైనేజీలో పడితే కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులకు అనేకమార్లు చెప్పినా స్పందించడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. స్వచ్ఛ మంగళగిరి చేస్తామని ఉపన్యాసాలు తప్ప పట్టణంలో ప్రధానమైన డ్రైనేజీ మురుగు కంపు కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని , మురుగు వలన దోమలు పెరిగి రోగాల బారిన పడతామనే ఆందోళనను పలువురు వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో స్పందించి గౌతమబుద్ధ రోడ్డులో డ్రైనేజీని సక్రమంగా నిర్మించి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రజానీకం కోరుతోంది.

ప్రజా సమస్యలపై
పోరాటం చేసేవారికే అవకాశం
గుంటూరు, సెప్టెంబర్ 18: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారికి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశాలు ఉంటాయని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అప్పిరెడ్డి అధ్యక్షతన నగర ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో బాబు సర్కార్ పాలనలో ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నామని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యక్తులను చిత్తుచేసి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమతో పాటు కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తామన్నారు. పార్టీని నమ్ముకుని జెండాను భుజాన పెట్టుకుని మోస్తూ క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని అన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని, తాయిలాలతో అధికారంలోకి రావచ్చని భావించే నేతలకు ప్రజలు తిరుగులేని తీర్పునివ్వనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మామిడి రాము, పోలూరు వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, డైమండ్‌బాబు, అంగడి శ్రీనివాసరావు, రాజా, నాగం కాశీవిశ్వనాథం, ఎస్‌కె జాని, కె కవిత, ఆరుబండ్ల కొండారెడ్డి, ప్రేమ్‌కుమార్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
అమరావతి, సెప్టెంబర్ 18: మదర్‌థెరిస్సా సోషల్ సర్వీస్ సొసైటీవారి సౌజన్యంతో ఎ-1 ఆర్థోకేర్ గుంటూరువారు ఆదివారం స్థానిక యోగాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరాన్ని అమరావతి సిఐ మురళీకృష్ణ ప్రారంభించారు. ప్రారంభ సభకు సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి ఉప్పుటూరి మోహనరావు అధ్యక్షత వహించారు. సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మోకాళ్లు, ఎముకలకు సంబంధించిన జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ తరహా జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. డాక్టర్ కంచర్ల రాంప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోకాళ్ల మార్పిడి, మోకాళ్ల అరుగుదల వంటి ఆపరేషన్లను అదునాతనమైన పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. సొసైటీ అధ్యక్షుడు కొమ్మినేని శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవే తమ సొసైటీ లక్ష్యమని, హరిశ్చంధ్రపురంలో తమ సొసైటీ ద్వారా పేద బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత విద్య అందించేందుకు ఒక స్కూల్‌ను కూడా స్థాపించినట్లు తెలిపారు.
300 మందికి వైద్య పరీక్షలు...
ఉచిత వైద్య శిబిరంలో మోకాళ్ల మార్పిడి సర్జన్ డాక్టర్ కంచర్ల రాం ప్రసాద్ 300 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా సలహాలు, సూచనలతో పాటు మందులు అందించారు. ఎముకల సాంధ్రత పరీక్షతో పాటు ఉచితంగా ఎక్సరేలు కూడా తీసి రోగులకు సహకరించారు. 300 మందికి పరీక్షలు నిర్వహించగా 120 మంది వివిధ రకాల శస్తచ్రికిత్సలకు అర్హత పొందారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వ సాయంతో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని సొసైటీ కార్యదర్శి మోహనరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పల్లోటి జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు బలుసుపాటి సత్యనారాయణ, సొసైటీ సభ్యులు రోగులకు సేవలందించారు.

నెలాఖరులోగా
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
అచ్చంపేట, సెప్టెంబర్ 18: మండలంలో గుర్తించిన బహిరంగ మలవిసర్జనలేని గ్రామాల్లో ఈ నెలాఖరుకల్లా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఎండిఒ డిజి నాయక్ లబ్ధిదారులతో చెప్పారు. ఆదివారం గుర్తించిన గ్రామాలైన కోగంటివారిపాలెం, చింతపల్లి, చెరుకుంపాలెం, రుద్రవరం, అంబడిపుడిల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 914 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంకాగా వాటిలో 597 మరుగుదొడ్లను పూర్తి చేయించామన్నారు. మరో 240 మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 27 మరుగుదొడ్ల నిర్మాణ పనులను కొత్తగా చేపట్టబోతున్నామని చెప్తూ 50 అదనంగా నమోదైన మరుగుదొడ్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ సిబ్బంది ఉన్నారు.

సేద్యానికి ఉచిత విద్యుత్ అదనంగా 2 గంటలు ఇవ్వాలి
మంగళగిరి, సెప్టెంబర్ 18: సేద్యానికి ఇప్పుడిస్తున్న ఉచిత విద్యుత్‌ను అదనంగా మరో రెండు గంటలు కూడా పొడిగించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో కమిటీ సమావేశం పార్టీ ఇన్‌చార్జ్, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగింది. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని, రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, పేదలకు అందించే ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి మంజూరైన ఇళ్లకు తోడు అదనంగా ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. మంగళగిరి, దుగ్గిరాల యార్డుచైర్మన్లు ఆరుద్ర భూలక్ష్మి, వంగా సాంబిరెడ్డి, నందం అబద్దయ్య, చావలి ఉల్లయ్య, గుత్తికొండ ధనుంజయరావు, గాదె పిచ్చిరెడ్డి, వల్లభనేని సాయిప్రసాద్, వెలగపాటి విలియం, కోసూరి రాజశేఖర్, కుక్కమళ్ల స్వామి, బెజ్జం రామకృష్ణ, వై కోటేశ్వరరావు, ఖాసింఖాన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్రపు డెక్కతో వరిపొలాలకు ముంపు
భట్టిప్రోలు, సెప్టెంబర్ 18: మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకుకారణంగా మండల కేంద్రం భట్టిప్రోలులోని పలు పల్లపు ప్రాంతాలలో వర్షపునీరు నిలిచిపోవటంతో సుమారు 200 ఎకరాల వరిపొలాలకు ముంపు ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి ఐదు రోజులు గడుస్తున్నా గుర్రపు డెక్క ఆకుతో నీటి పారుదల నిలిచిపోయి వరిపొలాలు నేటికీ బయటపడలేదు. భట్టిప్రోలు నుండి చావలి వళ్ళే రహదారి మార్గంలో అద్దేపల్లి సమీపంలోని బాడవ పొలాలు ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగాయి. ఈనీరు బయటకు వెళ్ళేందుకు ఏకైక మార్గం కనగాల మురుగు కాలువ మాత్రమే. మునిగిన పొలాలు బయట పడక పోవటంతో వరిదుబ్బులు కుళ్ళి పనికిరాకుండా పోతాయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో ఈసంవత్సరం పలు కాలువలు అభివృద్ధి పరిచినప్పటికీ కనగాల డ్రెయిన్‌లో ఎటువంటి పనులు చెపట్టక పోవటంతో ఈసంవత్సరం కూడా తీరని నష్కాన్ని చవిచూడాల్సి