రాష్ట్రీయం
ఖబడ్దార్ కాంట్రాక్టర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/26s5_2.jpg?itok=YFzRxN30)
దాచేపల్లి, సెప్టెంబర్ 25: వ్యాపారం వ్యాపారంగానే చేయాలి. స్వలాభం కోసం వ్యాపారం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎట్టి పరిస్థితులలో క్షమించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాచేపల్లి ప్రజలు హైవే రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తీవ్రంగా నష్టపోయినట్లు తమ దృష్టికి తెచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వరద వచ్చిన ప్రతిసారి దాచేపల్లిలోని ఇళ్లలోకి, షాపులలోకి వరద నీరు ప్రవేశించి నష్టపోతున్నామని ప్రజలు తెలిపినట్లు సిఎం చెప్పారు. దాచేపల్లి ప్రాంతంలో రోడ్డు విస్తరణ, వంతెన నిర్మాణ పనులపై జరిగిన అవకతవకలపై తక్షణం విచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. దాచేపల్లిలో వరద వలన అధికంగా చిన్న వ్యాపారులు నష్టపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని సిఎం చెప్పారు. అంచనాలు రూపొందించి వ్యాపారులకు నష్ట పరిహారం చెల్లిస్తామని సిఎం ప్రకటించారు.