ఆంధ్రప్రదేశ్‌

కాలువలో పడిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్. రాయవరం, నవంబర్ 5: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ సమీపంలో పెద్దమదుం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక నుండి విజయవాడ వెళ్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి కల్వర్టు గోడను ఢీకొట్టి కాలువలోకి బోల్తాపడింది. సుమారు 20 అడుగుల లోతులో ఉన్న కాలువలో కారు పడటంతో అందులో ప్రయాణిస్తున్న గాజువాకకు చెందిన బి శ్రీనివాసరావు(45), ఆయన భార్య శ్రీదేవి (40), శ్రీనివాసరావు బావ చెల్లబోలు ప్రసాద్ (52), గుడివాడకు చెందిన రమణ (45) కారులోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెడుతున్న కొందరు వ్యక్తులు కాలువలోకి దిగి రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రామస్థుల సహకారంతో పోలీసులు కారును క్రేన్ సహాయంతో బయటకు లాగి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఫ్రభుత్వాసుపత్రికి తరలించారు. నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు.