ఆంధ్రప్రదేశ్‌

దమ్ముంటే నల్ల కుబేరులను పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 4: నల్ల కుబేరుల భరతం పట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని, దమ్ముంటే నల్లకుబేరుల పనిపట్టి తమ నిజాయితీ నిరూపించుకోవాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరా సవాల్ విసిరారు. ప్రధాని మోదీ పలుకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఆదివారం పర్యటించిన ఆయన నోట్ల రద్దు, చిల్లర సమస్యపై వ్యాపారులు, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకే రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసినట్లు చెబుతున్నారని, అలాంటప్పుడు రూ.2 వేల నోటు ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. చిల్లర నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. క్యూలో నిలబడి కొందరు, విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక బ్యాంక్ ఉద్యోగులు సుమారు 80 మంది మృతి చెందారన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యల కిందికే వస్తాయని రఘువీరా అన్నారు. మరోవైపు మహిళల మంగళసూత్రాలు లాకునేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబం వద్ద లభించిన రూ.10 లక్షల నగదు వ్యవహారంపై చట్టపరంగా విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం..అనంతపురం జిల్లా హిందూపురంలో నోట్ల రద్దు అనంతరం ప్రజలు, వ్యాపారుల కష్టాలపై ఆరా తీస్తున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి