ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారిని దర్శించుకున్న కంచి స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 23: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజికి ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. జె ఇ ఓ శ్రీనివాసరాజు సాధరంగా ఆయన్ను ఆలయంలోకి ఆహ్వానించి స్వామి సన్నిధిలోకి తీసుకువెళ్ళారు. ఈసందర్భంగా స్వామీజి తన శిష్య బృందంతో కొన్ని నిమిషాల పాటు మూల విరాట్టును దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్థంభాన్ని మొక్కుకున్న స్వామి రంగనాయక మండపం చేరుకోగా, అక్కడ ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. జె ఇ ఒ శ్రీనివాసరాజు జయేంద్ర సరస్వతికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

చిత్రం..కంచి కామకోటి పీఠాధిపతికి స్వాగతం పలుకుతున్న టిటిడి పెద్ద జీయర్ స్వామి, జె ఇ ఓ శ్రీనివాసరాజు, పాలక
మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి