రాష్ట్రీయం

స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సికింద్రాబాద్, ఫిబ్రవరి 16: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకట్‌రామ్‌రెడ్డి(35), మెదక్ జిల్లా రామచంద్రపురంకు చెందిన రవీంద్ర(53) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. వెంకట్‌రెడ్డి గత కొన్ని రోజుల నుండి సన్‌రైస్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంకట్‌రామ్‌రెడ్డి గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈనెల 15వ తేదీ సాయంత్రం అరున్నర గంటల ప్రాంతంలో చేరాడు. ఇతను ఆసుపత్రిలో చేరిన గంటకే మృతి చెందాడు. అదే విధంగా రేమిడి ఆసుపత్రిలో చికిత్స పొందిన రవీంద్ర చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చనిపోయాడు. ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో జనవరి మాసం నుండి ఇప్పటి వరకు 12 మంది మృతి చెందిన్నట్లు అసుపత్రి వర్గాలు తెలిపాయి.