తెలంగాణ

కేరళ సిఎం రాకపై ఏబివిపి నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాకను నిరసిస్తూ ఎబివిపి కార్యకర్తలు ఆర్టీసి కళ్యాణమంటపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేరళలో ఎబివిపి కార్యకర్తలపై కేరళ సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ హత్య లు, దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆర్‌టిసి కళ్యాణ మండపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 200 మంది ఎబివిపి కార్యకర్తలు కళ్యాణ మంటపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి గాంధీనగర్, నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసన కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప మాట్లాడుతూ వామపక్ష సిద్ధాంతానికి ప్రజల్లో, విద్యార్థుల్లో రోజు రోజుకీ ఆదరణ తగ్గడంతో ఎబివిపికి ఆదరణ పెరగడాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోలేక ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.