అదిలాబాద్

తూర్పు జిల్లాలో 8 మంది సివిల్ ఎస్సైల స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 19: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న 8మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కరీంనగర్ రేంజ్ పరిధిలోని రామగుండం పోలీసు కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన సివిల్ ఎస్సైలు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా బదిలీ అయిన సివిల్ ఎస్సైల జాబితాలో జన్నారం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న భూమేష్ నిల్వాయి పోలీసు స్టేషన్‌కు, నిల్వాయి పోలీసు స్టేషన్ పనిచేస్తున్న ఎస్సై శ్రీకాంత్ దేవాపూర్ పోలీసు స్టేషన్‌కు, మందమర్రి పి ఎస్‌లో పనిచేస్తున్న ఎస్సై సతీష్‌ను ఎస్‌బి మంచిర్యాలకు, రామకృష్ణపూర్ పోలీసు స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై రాకేష్ వి ఆర్ ఆటాచ్‌డు టూ సిసి ఆర్‌బి రామగుండంకు, బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఆటాచ్‌డుగా పనిచేస్తున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను రామకృష్ణపూర్ పోలీసు స్టేషన్‌కు, పిసిఆర్ గోదావరి ఖని పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై రాజవౌళి గౌడ్ ను మందమర్రి పోలీసు స్టేషన్‌నుకు, దేవాపూర్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తు న్న ఎస్సై స్వామిని బెల్లంపల్లి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు, బెల్లంపల్లి టూటౌన్ పిఎస్‌లో పనిచేస్తున్న ఎస్సై ప్రసాద్‌ను జన్నారంపోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.