అదిలాబాద్

ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెనె్నల, ఏప్రిల్ 7: ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించి వ్యవసాయాభివృద్దిలో భాగం కావాలని మంచిర్యాల ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం అన్నారు. గురువారం మండలంలోని కుష్నపల్లి సమీపంలో రూ.12కోట్లతో నిర్మించతలపెట్టిన ముంపు బాధితులతో మాట్లాడారు. ప్రాజెక్టు సర్వే పనులు అడ్డుకున్నందుకు రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తామన్నారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోవాలని దీంతో కుష్నపల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని, పరోక్షంగా , ప్రత్యక్షంగా వందల మందికి ఉపాది లభిస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఆర్డీవో వెంట తహసిల్దార్ వీరన్న, ఇరిగేషన్ డీ ఈ రాజన్న, ఆర్ ఐ గోవింద్, గ్రామ సర్పంచ్ ఊరగొండ స్వప్న, నాయకులు పాల్గొన్నారు.