అదిలాబాద్

అల్లోలకు అసమ్మతి ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 14: రాజకీయాలకు కేంద్ర బిందువైన నిర్మల్ నియోజకవర్గంలో అనూహ్యంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుంగు శిష్యుడు, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తోసహా 21మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడం అలజడి సృష్టించింది. అనూహ్య పరిణామం ఎన్నికల్లో పోటీచేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీచేసి గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి మారిన పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు కోసం కుడిభుజంగా పనిచేసిన అప్పాల గణేష్, పలువురు కౌన్సిలర్లు మంత్రితో కొంతకాలంగా విభేదిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే మున్సిపల్ కార్యాలయంలో తమ పనులకు అడ్డుచెబుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన ఎజెండా పాటిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మున్సిపాలిటీలో విజిలెన్స్ దాడులు, అనుకూలమైన కమిషనర్, ఇంజనీర్లను బదిలీ చేసుకొని పనులు సాగించడంపై చైర్మన్ సహా కౌన్సిర్లందరూ మనోవేదనకు గురై పార్టీకి దూరంగా మసులుకుంటున్నారు. అంతర్గతంగా రగులుతున్న ఇంటిపోరు నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం ఖాయమని భావిస్తుండగనే డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చక్రం తిప్పి అల్లోలను రాజకీయంగా దెబ్బ తీసేందుకు శనివారం రాత్రి వరకు మంతనాలు సాగించి తన పంతం నెగ్గించుకున్నారు. రహాస్యంగా జరిగిన భేటీలో మున్సిపల్ చైర్మన్‌తోసహా 21మంది కౌన్సిలర్లు మహేశ్వర్ రెడ్డితో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం మేరకే ఆదివారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేయడం టీఆర్‌ఎస్ వర్గాల్లో గుబులు పుట్టించింది. ఇంద్రకరణ్ రెడ్డికి కీలకమైన మున్సిపల్ పరిధి ఓట్ల ప్రాబల్యానికి గండికొట్టేందుకు ఈ వ్యూహం ఎంతగానో దోహదం చేసిందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తో పాటు 16మంది టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు, ఒకరు స్వతంత్ర కౌన్సిలర్‌తో పాటు కోఅప్షన్ సభ్యుడు.. సాయంత్రం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం సంచలనం రేకెత్తించింది. అనూహ్య పరిణామానికి ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయులు కంగుతిన్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలను, ముఖ్యంగా శ్రీహరిరావువర్గాన్ని బుజ్జగించి దారిలోకి తెచ్చిన నేపథ్యంలోనే అప్పాల గణేష్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఆ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణంలో తుడుచుకుపెట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
చైర్మెన్, కౌన్సిలర్లకు కాంగ్రెస్ తాయిలాలు..?
ఇంద్రకరణ్ రెడ్డితో విభేదించి వేరుకుంపటి పెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తో సహా 21మంది కౌన్సిలర్లు అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించడం, వెనువెంటనే కాంగ్రెస్ గూటికి చేరుకోవడం వెనక పెద్ద తతంగమే నడిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మహేశ్వర్ రెడ్డి తన రాజకీయ వ్యూహారచనతో చైర్మన్, కౌన్సిలర్లను తనవైపునకు తిప్పుకునేందుకు రెండు మూడుసార్లు రహాస్య మంతనాలు సాగించి తాయిలాల ఎజెండా అమలు చేయడం వల్లే తన పంతం నెగ్గించుకున్నారని తెలుస్తోంది.
20న భైంసాలో జరిగే రాహుల్ బహిరంగ సభలో తీర్థం
టీఆర్‌ఎస్ పార్టీని వీడిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్‌తో సహా 21మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో నామమాత్రంగా చేరినప్పటికీ ఈనెల 20న భైంసాలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. అంతకు ముందు నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలో చైర్మన్‌తోసహా కౌన్సిలర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. భద్రతా చర్యల దృష్ట్యా రాహుల్ బహిరంగ సభ నేరడిగొండలో రద్దుకాగా అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు భైంసాలో జరిగే బహిరంగ సభలో పాలుపంచుకోనున్నారు. బహిరంగసభ ఏర్పాట్లను సోమవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించనున్నారు.