అదిలాబాద్

ఘనంగా ముగిసిన శతచంఢీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 30: గత ఐదు రోజులుగా రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో చేస్తున్న శతచంఢీయాగం సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు పూర్ణాహుతిని వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మద్య అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, ఎంపి గేడెం నగేష్, ఖానాపూర్, బోథ్, ముధోల్, లక్షెట్టిపేట్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపురావు, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, కోనేరె కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డి ఆర్‌డి ఎ పీడి అరుణకుమారి, ఐ ఎన్‌టియుసి నాయకులు వెంకట్‌రావు, ఆర్డివొ శివలింగయ్య, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తితోపాటు స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, టి ఆర్ ఎస్ నాయకుల హాజరయ్యారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో మంత్రి అల్లోల నివాసానికి తరలిరావడంతో కోలాహలంగా మారింది.