అదిలాబాద్

క్రీడలతోనే మానసికోల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమనపల్లి, మే 30: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని చెన్నూర్ ఏ ఎస్పీ సునీల్ దత్ శర్మ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడు మండలాల వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. పోలీసుల ఆధ్వర్యంలో వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాల క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. మారుమూల మండలాల్లో ప్రతిభగల క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిభగల క్రీడాకారులు తమ సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఫస్ట్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్‌కె.రహనా, ఎస్సై చందర్, వ్యాయామ ఉపాద్యాయులు, మూడు మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.