అదిలాబాద్

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూన్ 3: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శాంతినగర్‌లోని మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంధర్భంగా మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రెండేళ్ల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సమంజసం కాదన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంతో వారు అన్ని రంగాల్లో నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న ముస్లీంలా అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నర్సింగ్‌రావు, అంబకంటి అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు వాసు, నహీద్, ప్రవీణ్ పాల్గొన్నారు.