అదిలాబాద్

ప్రశాంతంగా ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 31: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లావ్యాప్తంగా 15,562మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష సందర్భంగా 144 నిషేదాజ్ఞలు విధించారు. జిల్లాలోని మూడు డివిజన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఆదిలాబాద్‌లో 36 పరీక్ష కేంద్రాలు, నిర్మల్‌లో 17 కేంద్రాలు, మంచిర్యాలలో 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ముందుగానే బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరుతో పాటు సంతకాలు సైతం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్‌వో సంజీవరెడ్డి పట్టణంలోని లిటిల్‌స్టార్ హైస్కూల్, జోసెఫ్ కానె్వంట్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు.