అంతర్జాతీయం

కాశ్మీర్‌లో గ్రెనేడ్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 4: కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియా జిల్లాల్లో సోమవారం మిలిటెంట్ల రెండు గ్రెనేడ్ దాడుల్లో 8మంది భద్రతా సిబ్బంది సహా 23మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈ రకమైన దాడులు తీవ్రమైన నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. మొదటి దాడి షోపియా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది పౌరులు, 4 పోలీసులు గాయపడ్డారు. మిలిటెంట్లు ఓ గ్రెనేడ్‌ను భద్రతా దళాలపైకి విసిరితే అది గురితప్పి రోడ్డుపై పడి సంభవించిన పేలుడులో పౌరులు గాయపడ్డారు. రెండోదాడి పుల్వామా జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ దళాలను లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గత మూడు రోజులుగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనె్నండుకుపైగా ఈరకమైన దాడులు జరిగాయి.