అంతర్జాతీయం

దేవాలయాలు,రైల్వేస్టేషన్లు పేల్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 6: యూపీలోని కొన్ని దేవాలయాలు, స్టేషన్లను పేల్చివేస్తామని లష్కర్ తొయిబా పేరిట బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. మధురలోని కృష్ణజన్మభూమి దేవాలయం, వారణాసిలోని కాశీవిశ్వనాథుని ఆలయాన్ని పేల్చివేస్తామని, అలాగే సహర్నపూర్, హాపూర్ రైల్వేస్టేషన్‌లను పేల్చివేస్తామని లష్కర్- ఎ-తొయిబా పేరిట ఫిరోజ్‌పూర్‌లోని రైల్వే డిఆర్‌ఎం గత నెల 29న ఒక లేఖ అందింది. అందులో జూన్ 8-10 తేదీల మధ్య దేవాలయాలు, రైల్వేస్టేషన్‌లు పేల్చివేస్తామని కమాండర్ అంబు షేక్ పేరిట హెచ్చరిక చేశారు. దీనిపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ఈ అంబూషేక్ ఎవరో నిఘావర్గాలకు తెలియదని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, బహుశా ఇది ఆకతాయి చేష్టగా భావిస్తున్నామని చెప్పారు. బెదిరింపులు వచ్చిన దేవాలయాలు, రైల్వేస్టేషన్లలో నిఘా పెంచామని తెలిపారు.