మార్చిలో యుద్ధ్భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1971 భారత్ సరిహద్దుల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన 1971 బియాండ్ బార్డర్స్ చిత్రాన్ని తెలుగులో ‘యుద్ధ్భూమి’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు శిరీష్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించాడు. జస్‌రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానర్లపై ఎ.ఎన్.బాలాజీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- రియల్ లైఫ్‌లో మేజర్ అయిన మేజర్ రవి దర్శకత్వం వహించిన చిత్రమిది. 1971 నేపథ్యంలో ఇండియా బార్డర్‌లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. ఆయన 2002 సంవత్సరంలో మొదటిసారి పునర్జని చిత్రంతో దర్శకుడిగా మారాడు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం దేశభక్తిని చాటుకుంది. మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.