గూఢచారితో మరోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూఢచారి అడవి శేష్ ఇప్పుడు మేజర్ అవతారం ఎత్తాడు. క్షణం, గూఢచారి, ఎవరు?లాంటి చిత్రాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా తనది సెపరేట్ ట్రాక్ అని నిరూపించుకున్నాడు శేష్. ఇప్పుడు దర్శకుడు శశికిరణ్ తిక్కాతో కలిసి శేష్ చేస్తున్న ప్రాజెక్టు -మేజర్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ దేశభక్తిని చాటే ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న కథ ఇది. ముంబై తాజ్ హోటల్లో 2008 నవంబర్ 26న చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాలు కాపడటం కోసం తన ప్రాణాన్ని ఫణం పెట్టిన వీర సైనికుడి కథగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా మహేష్‌బాబు నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న చిత్రంలో సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలు భాగస్వాములు. ఆసక్తిరేకెత్తిస్తోన్న ప్రాజెక్టులోకి తాజాగా శోభిత ధూళిపాళ చేరింది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోన్నట్టు చిత్రబృందం చెబుతోంది. బోర్డులోకి శోభిత రాకపై శేష్ తన ట్విట్టర్ పేజీలో స్పందిస్తూ ‘గూఢచారి తరువాత మేజర్ కోసం శోభితతో కలిసి పని చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకో సొంత కథ ఉంది. భావోద్వేగమైన ఆ కథకు ఆమె ఆత్మ. మేజర్ కథ భారతీయులు అందరి కోసం’ అంటూ వ్యాఖ్యానిస్తూనే శోభిత పాత్రను పరిచయం చేశాడు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న షూటింగ్‌లో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.