టచ్ చేసి చూడు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ కథానాయకుడిగా లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీమోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజపై నిర్మాత వంశీ మోహన్ క్లాప్‌నివ్వగా, గౌతంరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, వారం రోజులు పాటు తొలి షెడ్యూల్ చేసి తరువాత పాండిచ్చేరిలో 25 రోజులపాటు చిత్రీకరణ జరపనున్నామని తెలిపారు. రవితేజకు తగిన విధంగా మాస్ ఎంటర్‌టైనర్ కథను తయారుచేశామని, నిపుణులైన సాంకేతిక నిపుణులందరూ పనిచేస్తున్నారని వారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎం.సుకుమార్, సంగీతం:జామ్ 8, కథ:వక్కంతం వంశి, స్క్రీన్‌ప్లే:దీపక్ రాజ్, మాటలు:శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్:గౌతంరాజు, నిర్మాతలు:నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీమోహన్, దర్శకత్వం:విక్రమ్ సిరికొండ.