సింగం గర్జిస్తోంది నిర్మాత మల్కాపురం శివకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నోసార్లు వాయిదా పడినా సింగం-3 విడుదలైన అన్ని కేంద్రాల్లో గర్జిస్తోంది. ప్రతి షో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతూ తన స్టామినాను చూపిస్తోంది అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ ప్రధాన తారాగణంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలుగులో అందించిన చిత్రం ‘సింగం-3’. ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలిపారు. గత చిత్రాలకు సిరీస్‌గా విడుదలైన ‘సింగం-3’ ఆ చిత్రాలకన్నా వెరైటీ కథ, కథనాలతో రూపొందిందని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం సరికొత్తగా వుండడాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని తెలిపారు. గత రెండు సినిమాలకన్నా ఈ చిత్రంలో సూర్య నటన, టేకింగ్ సరికొత్తగా వుందని ప్రేక్షకులు చెబుతుండడాన్ని బట్టి ఈ సినిమా ఎంత విజయవంతమైందో అర్థమవుతోందని ఆయన తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల రోజున మార్నింగ్ షో వేయలేదని, మాట్నీ నుండే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైందని, అయినాగానీ ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్నారని అన్నారు. తొలి రోజునే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 7 కోట్ల 40 లక్షలు వసూలు చేసిందని, శుక్రవారం నుండి ప్రతి షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయని, తమ సినిమాకు పోటీగా మరో అగ్ర హీరో సినిమా విడుదలైనప్పటికీ ఎలాంటి ప్రభావం తమ సినిమాపై పడలేదని ఆయన వివరించారు. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం దక్షిణాది షోలే తరహాగా వుందని ప్రేక్షకులు అంటున్నారని తెలిపారు. త్వరలో విజయోత్సవ వేడుకలో భాగంగా సక్సెస్ టూర్‌కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.