నా జన్మ ధన్యమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, ప్రగ్యాజైస్వాల్, అనుష్క ముఖ్యపాత్రల్లో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం మంచి హిట్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్‌రెడ్డి మాట్లాడుతూ- ఇంత అద్భుత విజయాన్ని ప్రేక్షకులు అందించినందుకు ఆనందంగా ఉందని, హాధీరామ్ బాబా వేంకటేశ్వరస్వామితో పాచికలాడుతుంటే, అది మేమేనా అనే ఫీలింగ్ కలిగిందని అన్నారు. నాగార్జున నటనతో సెకెండాఫ్ 40 నిమిషాలు తన కళ్లల్లో నీళ్లు తిరుగుతూనే వున్నాయని, ఈ సినిమా ద్వారా తిరుమల క్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలు చాలా తెలిశాయని అన్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ- సినిమా చూసి గొప్ప అనుభూతికి లోనయ్యానని అన్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ఈ సినిమా తీసినప్పుడు తామెలా ఫీలయ్యామో, సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అవుతున్నారని, ఈ సినిమా చేయడంతో నిజంగా తన జన్మ ధన్యమైందని అన్నారు. ఈ చిత్రంలో నాగార్జున అనితర సాధ్యమైన నటనను ప్రదర్శించారని, క్లైమాక్స్‌లో కళ్లలో భావాలు పలికించి తన సత్తా చాటుకున్నాహరని అన్నారు. క్లైమాక్స్ పాట తీస్తున్నప్పుడు కట్ చెప్పడానికి నాకు మాట రాలేదని అన్నారు. నాగార్జున మాట్లాడుతూ- అన్నమయ్య చిత్రాన్ని ఆదరించినట్టే ఈ సినిమాను కూడా ఆదరిస్తున్నారని, సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోందని, ఇంత మంచి పేరు రావడానికి కారణం రాఘవేంద్రరావేనని, ‘అన్నమయ్య’ సినిమాతో నా డివోషనల్ జర్నీ మొదలైందని, ఇది సినిమా జర్నీయే కాదని, అప్పటినుండి ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగిందని అన్నారు. కీరవాణి అద్భుతమైన పాటలు అందించారని, ఈ సినిమా అయిన తరువాత అమల ననె్నంతగా ప్రేమిస్తుందో అర్ధమైందని, సినిమా చూస్తున్నంతసేపు నన్ను వదలకుండా పక్కనే కూర్చుని ఉందని అన్నారు. తన మనసులో నేను ఎంత దగ్గరగా వున్నానో అర్థమైందని, సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు.