ఏప్రిల్ 14న మిస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ మెగా హీరో వరుణ్‌తేజ్ 2016లో రెండు సినిమాల్ని మొదలుపెట్టాడు. ఆ రెండింటిలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్’ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. స్పెయిన్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. దర్శకుడు శ్రీనువైట్ల కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మురళిశర్మ, రఘుబాబు, పృథ్వీ వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.