రొమాంటిక్ థ్రిల్లర్‌గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్, సురభి, శీరత్‌కపూర్ హీరో హీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా వుంది. రొమాంటిక్ థ్రిల్లర్ కథతో తెరకెక్కే ఈ చిత్రంలో సైన్స్‌ఫిక్షన్ కూడా ఉంటుంది. మంచి టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవన్ కెమెరా అందిస్తున్నాడు. ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభిస్తున్నామన్నారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ.. భిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సైంటిఫిక్ ఫిక్షన్‌గా రూపొందే ఈ సినిమాలో రొమాంటిక్ థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. ప్రతీ క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉండేలా స్క్రిప్ట్ కుదిరింది అన్నారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినందుకు ఆనందంగా వుంది. శిరీష్‌తో మొదటిసారి పనిచేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సుజిత్ వాసుదేవ్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, ఆర్ట్: నాగేంద్రప్రసాద్, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.