అశ్లీలత లేని బొమ్మల రామారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో నిశాంత్ దర్శకత్వంలో మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ పతాకంపై పుదారి అరుణ రూపొందించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఈ సినిమాను చూసి చిత్ర దర్శక నిర్మాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా రోజుల తరువాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందని, ఎటువంటి అశ్లీలతకు తావులేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన ఈ చిత్రంలో చాలా ఏళ్ళ తరువాత ప్రముఖ గాయని పి.సుశీల పాడటం మరింత ఆనందాన్ని కల్గించిందని తెలిపారు. పాటలన్నీ అందరికీ నచ్చేలా ఉన్న ఈ సినిమాలో కథను నమ్మి చిత్రాన్ని రూపొందించారని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. నిర్మాత పుదారి అరుణ మాట్లాడుతూ, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, మార్చి మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సూరి, తిరువీర్, రూపారెడ్డి, ప్రియదర్శిని, విమల్ కృష్ణ, కేశవ్ దీపక్, మోహన్ భగత్, సంగీర్తన, జ్యోతివర్మ, అభయ్, గుణకర్, శివా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:బి.వి.అమర్‌నాధ్‌రెడ్డి, సంగీతం:కార్తీక్ కొడగండ్ల, శ్రవణ్ మేఖేల్, ఎడిటింగ్:శివ శ్రీనివాస్, రచన, దర్శకత్వం:నిశాంత్ పుదారి.