స్పీడున్నోడు ప్లాటినం వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ ‘సుందర పాండ్యన్’కు రీమేక్‌గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పీడున్నోడు’. భీమనేని సునీత నిర్మాత. ఇటీవల విడుదల చేసిన సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. నటుడు నాగార్జున, వెంకటేష్‌లు చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లు అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సాయిశ్రీనివాస్ చాలా హార్డ్‌వర్క్ చేస్తాడని, సినిమా పాటలు చాలా బావున్నాయని, కొన్ని యాక్షన్ సీన్స్ చూశానని. శ్రీనివాస్ చాలా బాగా నటించాడని, బెల్లంకొండ సురేష్ అగ్రెసివ్, డైనమిక్ ప్రొడ్యూసర్ అని అన్నారు. నాగచైతన్యతో ‘తడాఖా’ సినిమా చేశారని, ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, చాలా తక్కువ మందికి ఇలాంటి టైటిల్స్ సూట్ అవుతాయని, శ్రీనివాస్ తన డాన్సులు, ఫైట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడని, ‘స్పీడున్నోడు’ టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ అని అన్నారు. మంచి స్క్రిప్ట్‌తో సినిమా చేస్తున్నారని, పెద్ద సక్సెస్ కావాలని చెప్పారు. భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజుల్లో సినిమాను చిత్రీకరించడం, రిలీజ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, మంచి కథ దొరకడమే చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని, అందుకే జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకొని రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నానని అన్నారు. మూడు సంవత్సరాలుగా ఓ రీమేక్ స్క్రిప్ట్‌ను నమ్ముకొని వర్క్‌చేశామని, నాతోపాటే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ట్రావెల్ చేసి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని, ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చిందని, ఆడియో కంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. టెక్నాలజీపరంగా వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని సినిమా చిత్రీకరించామని, చాలా ట్రెండీగా ఉంటుందని, సాయి శ్రీనివాస్ సినిమా కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యాడని, చాలా మెచ్యూర్డ్‌గా నటించాడని అన్నారు. సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ, ‘వసంత్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుందన్నారు. చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అలీ, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, మధునందన్, శ్రీనివాస్‌రెడ్డి, పోకూరి బాబురావు, పృథ్వి, వసంత్ తదితరులు పాల్గొన్నారు.