13న జిందగీ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ సమర్పణలో కృష్ణ చైతన్య నిర్మిస్తున్న చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 13న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- రామ్, దేవిశ్రీల కాంబినేషన్‌లో వస్తోన్న ఐదవ చిత్రమిది. ఐదు సినిమాలు మ్యూజికల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాలకు తగ్గకుండా ఇందులో పాటలుంటాయి. 13న పాటలను విడుదల చేసి 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ- ఈ చిత్రంలో రామ్ రాక్‌స్టార్‌గా కనిపిస్తాడు. మా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు బెస్ట్ అవుతుంది. అభిరామ్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన కథే ఈ సినిమా. రామ్ సరికొత్త స్టైల్‌లో కనిపిస్తాడు అన్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌశిక్ తదితరులు నటిస్తున్నారు.