సినిమాలు చేస్తే సీరియళ్లు మానేయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాకర్.. టివీ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. నటుడిగా, దర్శకుడిగా పలు విభాగాల్లో టెలివిజన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన తాజాగా దర్శకుడిగా మారుతూ, తెరకెక్కించిన చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. ఆది, సాయికుమార్, వైభవి, రష్మి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో వి-4 మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ చెప్పిన విశేషాలు..
మొదట మరో కథ..
అల్లు శిరీష్‌తో సినిమా చేద్దామని ఓ కథను ఆయనకు వినిపించాను. ఆ సమయంలో బన్నీ వాసును కలవడం జరిగింది. తనకుకూడా కథ వినిపించాలని సినిమా చేద్దామని అనుకున్న సమయంలో తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేద్దామని వాసుకు చెప్పడంతో ఆ సినిమ నువ్వు ఎందుకు చేయకూడదని నన్ను చూడమన్నారు. నాలుగు పెద్ద బ్యానర్లు కలిసి వి-4 మూవీస్‌ని ప్రారంభించి ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు రావడంతో తమిళ రీమేక్‌ను తెలుగులో చేయడానికి సిద్ధమయ్యా. తమిళ చిత్రానికి దీనికి చాలా తేడా వుంటుంది. తెలుగు నేటివిటీకి వచ్చే వరకు చాలా మార్పులు చేసాం. ఈలోగా తమిళ రీమేక్ రైట్స్ విషయంలో పర్మిషన్ రాకపోవడంతో ఏడాదిన్నరపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
హారర్ సినిమా కాదు..
నిజానికిది హారర్ సినిమా కాదు.. థ్రిల్లర్ సినిమా. థ్రిల్లర్ అంశాల చుట్టూ సాగే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. రెగ్యులర్‌గా వచ్చే హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా వుంటుంది.
పాత్రలే హైలైట్..
ఇందులో నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ముఖ్యంగా ఆది, బ్రహ్మాజీల పాత్రలు కీలకంగా వుంటాయి. వీరిద్దరికీ ఒకరకంగా ఇది లైఫ్ టైమ్ పాత్రలని చెప్పవచ్చు. అలాగే వైభవి, రష్మిల నటన గ్లామర్ ఆకట్టుకుంటుంది. పూర్తిగా ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు వున్నాయి.
టీవీ షోలు చేస్తా..
దర్శకుడిగా మారిన తర్వాత సీరియళ్లు మానేస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. సినిమాల్లోకి వస్తే సీరియళ్లు మానేయాలా? వీలున్నప్పుడల్లా టీవీ సీరియల్స్, టీవీ షోలు చేస్తా. ఈ సినిమా పూర్తయిన తర్వాత మారుతి బ్యానర్‌లో మరో చిత్రం చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. అది పూర్తిగా ప్రేమకథా చిత్రం. దీంతోపాటు మరో సినిమా కూడా చేయాలి.