ప్రేమ పందెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రవణ్, మీనాక్షి గోస్వామి, జబర్దస్త్ వినోద్, కిరణ్ కళ్యాణ్ నరేష్ సాంబశివ ప్రధాన పాత్రదారులుగా శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం.అర్జున్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ప్రేమపందెం’తో పాటు సక్సెస్ పందెంలో కూడా ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిన్న సినిమాలకు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ ఈ చిత్ర నిర్మాత లక్ష్మీ నారాయణ సినిమాను విడుదల కూడా చేస్తుండటం నిజంగా అభినందనీయం. నా తరఫున ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇస్తున్నా అన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి ఎస్. సాయి వెంకట్ మాట్లాడుతూ- సినిమాలో ఆర్టిస్టులు అందరూ కొత్తవారు అయినప్పటికీ చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు వెంకట్ ఎస్.వి యు మాట్లాడుతూ పాటలు ఇంత చక్కగా రావడానికి నా సాహిత్య రచయిత సహకారం ఎంతో వుంది. అలాగే దర్శక, నిర్మాత కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు అన్నారు. నిర్మాతల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ- దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేమిటో తెరమీద చూస్తేనే బావుంటుంది. మా యూనిట్ సభ్యులు అందరూ తమ చిత్రంగా భావించడం వల్ల ఇంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమైంది. త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు ఎం.ఎం అర్జున్ మాట్లాడుతూ- వెంకట్ ఎస్.వి.హెచ్ అద్ధుతమైన స్వరాలు అందించారు. వాటికి తగ్గట్టు సాహిత్యం కూడా బాగా కుదిరింది. ‘ప్రేమపందెం’ అంటే కేవలం యూత్ సినిమానే కాదు, ఇందులో అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పటికీ రుణపడి వుంటాను అన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణలు సినిమా విజయం సాధించాలని తమ ప్రసంగాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ క్యారెక్టర్ నటుడు శ్రవణ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకరరావు, బస్టాప్ కోటేశ్వరరావు, సీనియర్ వినోద్ సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబులయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: ఓబులయ్య, ఎడిటింగ్: సంతోష్, సంగీతం: వెంకట్ ఎస్.వి.యు, రీ రికార్డింగ్: మాహీధన్, కొరియోగ్రఫీ: శామ్యూల్, కెమెరా: అమర్ జి, సహకారం శరత్‌సాగర్, సహ నిర్మాత: ఓబులయ్య సోమిరెడ్డి పల్లె, నిర్మాత: ఎం. లక్ష్మీ నారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం అర్జున్.