ముఖ్యమంత్రి నేనే అయితే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూరి క్రియేషన్స్ పతాకంపై వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్.శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, జీవిత రాజశేఖర్ క్లాప్‌నిచ్చారు. తొలి సన్నివేశానికి తమ్ముడు సత్యం గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మోహన్ రావిపాటి మాట్లాడుతూ- పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేవిప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రేపటి నుంచి షెడ్యూల్ ప్రారంభిస్తాం. 15 రోజులపాటు హైదరాబాద్‌లో ఉంటుంది. ఆ తర్వాత కందుకూరు, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 40 రోజుల్లో సినిమాను పూర్తిచేస్తాం అన్నారు. నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ- మా చిత్రం ద్వారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు. పబ్లి క్ పాయింట్ వ్యూలో కూడా సినిమాలో చర్చిస్తున్నాం. మా దర్శకుడు మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇకమీద మా బేర్‌లో ఇలా వరుసగా సామాజిక కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం అన్నారు. ఇది నా ఫస్ట్ ఫిలిం. నేనొక యువ నాయకుడిగా నటిస్తున్నా అన్నారు.
వాయుతనయ్. సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ- ఇందులో నాలుగు పాటలున్నాయి. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం. నాతో దర్శకుడు మంచి బాణీలు చేయిస్తున్నారు అన్నారు. వాయుతనయ్, శశి, దేవిప్రసాద్, నళినికాం, రామరాజు, శుభలేఖ సుధాకర్, సుచిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:్ఫణి కళ్యాణ్, కెమెరా:కమలాకర్, రచన సహకారం:హిరణ్మయి, సత్య.జె.బి, నిర్మాత:ఆలూరి సాంబశివరావు, రచన, దర్శకత్వం:మోహన్ రావిపాటి.