21న నాని ‘ఎం.సీ.ఎ’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఎం.సీఏ’. ‘ఫిదా’ చిత్రం ద్వారా భానుమతిగా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసిన సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ- ‘మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ ఏడాది రూపొందించిన శతమానం భవతి, నేను లోకల్, డీజే, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు హిట్స్ సాధించాం. డబుల్ హ్యాట్రిక్ సాధించడానికి ‘ఎం.సీఏ’తో సిద్ధమవుతున్నాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. చాలా నమ్మకంగా ఉన్నాం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో నాని ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్‌కు నాంది పలుకుతాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఏడాది ‘నేను లోకల్’తో నాని మా బ్యానర్‌లో హిట్ కొట్టాడు. ‘ఎం.సీఏ’ దీన్ని మించి హిట్టవుతుంది. మా బ్యానర్‌లో సెనే్సషనల్ హిట్ అయిన మూవీ ‘ఫిదా’లో నటించిన సాయిపల్లవి నానికి జోడీగా నటిస్తుండగా, ప్రముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాదు, ప్రేక్షకుల్లో మా బ్యానర్ విలువను పెంచుతూ మాకు డబుల్ హ్యాట్రిక్‌ను తెచ్చిపెట్టే చిత్రమవుతుందన్న గట్టి నమ్మకం వుంది. నేను లోకల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు. అందుకు సాక్ష్యమే ఇటీవల విడుదలైన టైటిల్ ట్రాక్‌కు వచ్చిన స్పందన. అద్భుతమైన కథ, అన్నీ సమపాళ్లలో ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని దర్శకుడు వేణు సరికొత్త స్టయిల్‌లో చూపించనున్నారు. విజయాలు సాధిస్తున్న నానికి ఈ ‘ఎం.సీఏ’ చిత్రం మరో మెట్టు కానుంది. రెండు పాకలు మినహా చిత్రీకరణంతా పూర్తయింది. ఈ రెండు పాటలను స్పెయిన్‌లో చిత్రీకరిస్తాం. నాలుగు రోజుల్లో పాటల చిత్రీకరణను పూర్తి చేసేస్తాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం’ అన్నారు. నాని, సాయిపల్లవి, భూమిక, విజయ్ సీనియర్ నరేష్, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానకి మాటలు: మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్: రామాంజనేయులు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ వేణు.