జై సింహా టాకీ పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సికె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందిస్తున్న చిత్రం ‘జై సింహా’. నయనతార, నటాషా జోషి, హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. బాలకృష్ణ, అశుతోష్ రాణా కాంబినేషన్లో అరవై మంది ఫైటర్స్తో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించి టాకీపార్ట్ పూర్తిచేశారు. జనవరి 12న విడుదలకానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘టైటిల్కు బాలకృష్ణ ఫస్ట్లుక్కు అభిమానులనుండి మంచి స్పందన లభిస్తోంది. ఆయన సినిమాలు ఏ స్థాయిలో వుంటాయో అంతే స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. ప్రకాష్రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్భట్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.