‘ఒక్క క్షణం’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్, సురభి, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో హీరో శిరీష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ మంచి కథను తీసుకొని ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, థ్రిల్లర్‌గా సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిన ఇందులో పార్లర్ లైఫ్, కొత్త కథాంశంతో కనిపిస్తుందని తెలిపారు. శ్రీనివాస్ అవసరాల ఓ కీలకమైన పాత్రలో నటిస్తారని, అన్ని టెక్నికల్ హంగులన్నీ హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సమయంలోనే ఈ కథను నిర్మాతకు చెప్పానని, జీవా పాత్రలో ఫరఫెక్షన్ కోసం శిరీష్ హార్డ్‌వర్క్ చేశారని, ప్రేమకు, డెస్టినికి మధ్య పోరాటంలో ఈ సినిమా సాగుతుందని దర్శకుడు వి.ఐ. ఆనంద్ అన్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీరత్‌కపూర్, అబ్బూరి రవి తదితరులు పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా శ్యాం కె. నాయుడు, సంగీతం మణిశర్మ, ఎడిటింగ్ చోటా కె. ప్రసాద్, మాటాలు అబ్బూరి రవి, నిర్మాత చక్రి చిగురుపాటి, దర్శకత్వం వి.ఐ. ఆనంద్.