మణిరత్నం యాక్షన్ థ్రిల్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చెలియా’ సినిమా తరువాత మణిరత్నం భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్‌స్వామి, విజయ్‌సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఇదివరకే యూనిట్ ప్రకటించింది. ఈనెలలో ముహూర్తం జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. జ్యోతిక, ఐశ్వర్య, రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించనున్నఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నాడు. సంతోష్ శివన్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేస్తుండడం మరో విశేషం. ఎన్నో మరపురాని సినిమాలు అందించిన మణిరత్నం ఈ సినిమాతో మరో హిట్ కొట్టి తన తడాఖా చూపించాలని కోరుకుందాం.