ఒక్క క్షణం దర్శకుడితో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ ఒక్క రోజులో కోటి వ్యూస్ దాటి సంచలనం రేపింది. తాజాగా మలయాళంలో కూడా విడుదలైన ఈ టీజర్‌కు అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కడం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటించే తదుపరి చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అల్లు శిరీష్‌తో ఒక్కక్షణం చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వి.ఐ.ఆనంద్. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఓ కథను సిద్ధం చేశాడని, ఆ కథను ఆయనకు వినిపించే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆనంద్ చెప్పిన లైన్ నచ్చడంతో అల్లు అర్జున్ ప్రొసీడ్ అవ్వమని చెప్పాడట. దాంతో స్క్రిప్ట్ విషయంలో బిజీగా మారాడు దర్శకుడు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం రానుందని సమాచారం.