‘మెహబూబా’ షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో చేస్తున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పటికే ఆకాష్ తన వంతు డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా సాగే ఈ సినిమాను ఈ వేసవికి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇందులో ఆకాష్ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సందీప్ చౌతా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.