మైత్రివనం గ్రీటింగ్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుఖేష్ ఈశ్వర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వినూత్నంగా ఆలోచించిన చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ప్రత్యామ్నాయంగా మూవీ గ్రీటింగ్‌ను సిద్ధం చేసి డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- మైత్రివనం ఫీనింగ్స్ ఎల్‌వీ మూవీ గ్రీటింగ్ బాగుంది. ఫస్ట్‌లుక్‌లో కొత్తదనం కనిపిస్తోంది. దర్శకుడు రవిచరణ్ నాకు తెలుసు. సినిమా కోసం బాగా కష్టపడతాడు. అతనికీ, నిర్మాత సుఖేష్ ఈశ్వర్‌కు ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ- చిన్న చిత్రాలకు పరిశ్రమలో ప్రోత్సాహం తక్కువ. నా అభిమాన దర్శకుడు సుకుమార్ నా తొలి చిత్ర మూవీ గ్రీటింగ్‌ను విడుదల చేయడం మర్చిపోలేను. మూవీ గ్రీటింగ్ చూసి ఆయన చెప్పిన మాటలు మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నాను. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు. అద్భుతాలు సృష్టించగలడు అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ ఈ మైత్రివనం. కథను పూర్తిగా నమ్మి ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సుఖేష్ ఈశ్వర్‌కి, నటీనటులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత సుఖేష్ ఈశ్వర్ మాట్లాడుతూ యువతకు నచ్చేలా మంచి సందేశాన్ని ఇస్తూ మైత్రివనం నిర్మించామన్నారు. జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, చంటి, వేణు, గెటప్ శ్రీను, రాజ్‌బాలా, శరత్‌కుమార్, ప్రసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:పి.ఆర్., ఎడిటర్:కిషోర్ మద్దాలి, కెమెరా:పరంధామ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:రవి చరణ్.ఎం.