పంతం పడితే ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘పంతం’. ‘్ఫర్ ఎ కాస్’ ఉపశీర్షిక. ‘బలుపు’, ‘పవర్’, ‘జైలవకుశ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరియమవుతున్నారు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే వివిధ మాధ్యమాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై పలురకాల వార్తలు వస్తుండటంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధి స్పందించారు. ‘‘మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ అనుకున్న ప్రణాళిక ప్రకారం తెరకెక్కుతోంది. మంచి మెసేజ్, కమర్షియల్ హంగులున్న సినిమాగా మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇక్కడకు రాగానే మీడియా సమక్షంలో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. అప్పటివరకు సినిమా విడుదల తేదీపై ఏ వార్తలను నమ్మవద్దు. ఇక సినిమా విషయానికి వస్తే హీరో గోపీచంద్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు కనపడని స్టైలిష్ లుక్‌లో గోపీచంద్ కనపడతారు. సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మెహరీన్ చాలా మంచి పాత్రలో కనపడతారు. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయ’ని తెలిపారు.